Header Banner

విశాఖలో కరాచీ బేకరీ వద్ద నిరసనలతో ఉద్రిక్తత! పహల్గాం దాడికి ప్రతిస్పందనగా...!

  Mon May 05, 2025 18:09        India

కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాకిస్తాన్ పై ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్రం దాడి చేయాల్సిందేనన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ లోని కరాచీ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ విశాఖలో ఇవాళ నిరసనలు జరిగాయి. పహల్గాం దాడి నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నగరం పేరుతో ఉన్న కరాచీ బేకరి పేరును మార్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ విశాఖలో హిందూ జన జాగరణ సమితీ నిరసనలు చేపట్టింది. ఈ గ్రూపు కార్యకర్తలు కరాచీ బేకరి వద్ద ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. వాటిలో కరాచీ పేరు తొలగించి భారత్ ను గౌరవించాలనే నినాదాలు ఉన్నాయి.

జాతీయ జెండాలతో జాగరణ సమితి కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. కాసేపు నిరసనల తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటివరకూ భారత్-పాక్ మధ్య ఎన్ని విభేదాలున్నా, యుద్దాలు కూడా జరిగినా కరాచీ బేకరి పేరు మార్పు డిమాండ్ మాత్రం ఎక్కడా వినిపించలేదు. కానీ ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత మాత్రం ఇలా కరాచీ బేకరీ పేరుపై కూడా హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా నిరసనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే నిరసన శాంతియుతంగానే సాగడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై పరిమితంగా అయినా దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతోనూ సమావేశమయ్యారు. ఇవాళ రక్షణ కార్యదర్శితోనూ భేటీ అయ్యారు. పాకిస్తాన్ పై యుద్దసన్నద్దతను వారితో చర్చించారు.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VisakhapatnamProtest #KarachiBakery #PahalgamAttack #AntiTerrorProtest #IndiaAgainstTerror #BoycottPakistan